మలయధ్వజ రాజాశ్రయము - విజ్ఞాత బ్రాహ్మణుని తత్వోపదేశము

Marriage to Malayadhvaja & Teachings of the Unknown Brahmin

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, పురంజని మలయధ్వజ మహారాజు ఆశ్రయంలో జీవితాన్ని కొనసాగించే రీతిని, ఆత్మ యొక్క పునర్యాత్రకు రూపకంగా వివరిస్తారు. మహారాజు దేహత్యాగం చేసిన పిదప పురంజని శోకసముద్రంలో మునిగిపోతుండగా, ఒక అజ్ఞాత బ్రాహ్మణుడు ప్రత్యక్షమై ఆమెకు ఆత్మజ్ఞానం బోధిస్తాడు. దేహాభిమానం మిథ్య అని, జీవుని నిజస్వరూపం నిత్యశుద్ధమైన ఆత్మ అని ఈ తత్వోపదేశం స్పష్టంగా తెలియజేస్తుంది.

In this sacred episode from Canto 4 of the Srimad Bhagavatham, we explore the story of Puranjani's new life as she takes shelter under the noble king Malayadhvaja, symbolizing the soul's renewed journey under divine guidance. After the king's passing, Puranjani falls into grief, until a mysterious and enlightened Brahmin appears and reveals the profound truth of her real identity beyond body and mind. Through this powerful allegory, we receive timeless teachings on the nature of the Self, the illusion of attachment, and the ultimate path toward liberation.

← Prev Next →
Marriage to Malayadhvaja & Teachings of the Unknown Brahmin bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః విశ్వాయ విశ్వ భవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురశక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపవృహ్హిత పూర్ణ బోధ వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే ఓ శ్రీహరి, నీవు నీ ఇచ్ఛచే గొప్ప మాయాశక్తి యొక్క రజస్తత్వ తమో గుణములను ఉపాధిగా స్వీకరించి క్రమముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమై నీవే జగద్రూపముగా వెలిసినావు. దేశ కాలములకు అతీతమైన నీవు శాశ్వత కాలము వర్ధిల్లే పూర్ణ జ్ఞాన స్వరూపమునందు నిలిచి తమస్సునకు అతీతుడవై ఉన్నావు. నీకు నమస్కారము. ఏత్ క్యాంటో, 17th చాప్టర్, నైన్త్ ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 33వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజన చరిత్ర, పురంజన చరిత్ర తత్వార్ధాన్ని కొంతవరకు మనం అనుభవించాం. ఇంకా ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. జీవుడు శరీరములతో చేరిన తరువాత మనుష్య శరీరము లభించుట చాలా దుర్లభం. ఆ శరీరముతో చేరి ఉన్నను జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో పొందిడి బాధలను చూచి మనసు వివేకమును దైవవశమున ఒకప్పుడు పొందును. వివేకాత్మకమైన బుద్ధి ఉదయించును. కానీ అనంతములగు వాసనలు రుచులతో నిండిన ప్రకృతి సంబంధము మరల కలుగును. కలుగగానే రజస్తమస్సులతో కూడిన బుద్ధి మరల తన వశము చేసుకొని అతనిని మోహింప చేసుకొనును. అట్లే పురంజనుడు వేట నుండి వచ్చి భార్య కనపడక ఎట్లో ఆమెను చూచి ఆమెతో కూడి ఉండెను. ఆమె తన విలాసములచే వశపరుచుకొని రజస్తమస్సులు కలిగిన బుద్ధి కలుగును. ఆ కర్మాచరణములే ఆ నాయక చేసెడి విలాపములు.

ఈతడు దానికి వశపడి మరల ఆమెతో కలిసి మరల కర్మనిష్టుడై ఉండెను. ఇట్లు పురంజని పురంజనుడు రమించుచుండిరి. ఒకనాడు పురంజని స్నానము చేసి ముఖము అలంకరించుకొని ఉజ్వలములగు వస్త్రములను దాల్చి రాజు వద్దకు చేరెను. అతడు ఆమెను చూచి చాలా అభినందించెను. ఆమె అతనిని కౌగలించుకొనెను. రహస్యముగా ఎన్నో విషయములు మాట్లాడుకొనిరి. బుద్ధి చెడి, వివేకము నశించి, కాలము గడిచిపోవుచున్నదని గుర్తింపు లేక పగలు రాత్రి అని తెలియకుండా ఆమెతో రమించుచుండును. రజోగుణ ప్రచురమగు బుద్ధితో స్త్రీలోలురై పురుషులు ఇట్లే జీవితము గడుపుచుందురు. విలువైన పాన్పుపై పరుండి ప్రియురాలి భుజమునే తలగడగా ఉంచుకొని విషయ భోగముల వలన కలిగిన అజ్ఞానము క్రమ్మివేయగా ఆమెతో కలిసి ఉండి భోగములు అనుభవించుటయే. పురుషార్థమనుకొనెను. తన్ను తాను మరిచి ఉండెను. అప్పుడు అతనికి తన పర తెలియకుండా ఉండెను. అనగా ఆత్మ స్వరూపమును పరమాత్మ స్వరూపమును కూడా మరిచి ఉండెను. ఇట్లు పరవశించి ఉండగా కాలము గడుచుట తెలియకుండగని అతని యవ్వనము గడిచిపోయెను. పురంజనునకు పురంజని యందు పదకొండు వందల మంది కుమారులు కలిగిరి. ఇంద్రియములు 11, 11 ఇంద్రియములకు కలిగే వికారములు ఒక్కొక్క దానికి 100 100 అని భావించి 1100 మంది అని భావించి 1100 మంది పుత్రులు అని చెప్పిరి. ఇంద్రియ వికారములు కలిగిన తరువాత బుద్ధివృత్తులు ఏర్పడును. అవి ఆడపిల్లల వంటివి. ఆ బుద్ధివృత్తుల వలనే కీర్తి అపకీర్తి కలుగుచుండును. ఇంద్రియ పరిణామములు ఏర్పడిన తరువాత బుద్ధివృత్తులు ఏర్పడును. ఒక్కొక్క ఇంద్రియమునకు 10 బుద్ధివృత్తులు ఏర్పడినట్లు భావించినచో మొత్తము 11 ఇంద్రియములకు 110 బుద్ధివృత్తులు ఏర్పడినవి అని భావించి వాని ఆడపిల్లలుగా 110 అని వర్ణించిరి. ఇట్లు సాగుచున్నప్పుడు. పురంజనునకు ఏ 10 సంవత్సరములు వయస్సు గడిచిపోయినది. అతడు పరిపాలించు రాజ్యమునకు పంచాల రాజ్యమని పేరు. విషయములను జీవునకు అనుభవింప వ్యక్తము చేయునవి కనుక ఇంద్రియములకు పంచాలములని పేరు.

ఆ పంచాలమే పాంచాలము. ఆ పంచాలములకు అనగా విషయానుభవములకు ప్రభువు జీవుడు. కనుక ఇతనిని పాంచాలపతి అందురు. ఇంద్రియ పరిణామములే కుమారులు. వానిచే ఏర్పడిన బుద్ధివృత్తులే కుమార్తెలు. వారికి తగిన సంబంధములు చూచి వివాహములు చేసిరి. ఇంద్రియములతో విషయములను అనుభవించిన తరువాత బుద్ధితో వానిని గూర్చి మంచి చెడులు ఆలోచించి ఇది చేయవలెను ఇది చేయరాదు. అనడి చింతనము చేయుదుము. అవే ఆ భార్యలు, భర్తలును ఇట్లు బుద్ధితో నిశ్చయించి కర్మలు చేయనారంభింతురు. అవి పుణ్య కర్మలు, పాప కర్మలు కూడా ఉండును. ఇదే సంతానం. ఇట్లు పురంజనునకు, పురంజనికి పుట్టిన కుమారులకు, కుమార్తెలకు వంద వంద బిడ్డలు కలిగిరి. ఇట్లు ఇంద్రియములు, విషయములు అనుభవించుట, దానిచే బుద్ధివృత్తులు ఏర్పడుట, దానిచే కర్మలు చేయుట. ఇట్లు ఈ శరీరముతో కూడిన జీవునకు సంసారము పెరిగినది. పురంజనునకు పురంజనుకి వంశము బాగా బాగా వృద్ధి పొందెను. పురంజనునకు తన ఆదాయములో భాగస్వాములగు కుమారులయందు ఇంటియందు ధనమందు మమకారం పెరిగెను. వాటిని గూర్చియే అతడు ఎల్లప్పుడూను ఆలోచించుచు తనను గూర్చి గాని మరొకరి గూర్చి గాని ఆలోచించకుండా జీవించుచుండెను. ఇదే శరీరముతో కూడిన జీవుని యొక్క సాంసారిక ప్రవృత్తి. ఎన్నో పశువులను చంపుచు అనేకమైన భోగములను కోరి యజ్ఞములను చేయుచుండెను. దేవతలకు, పితృ దేవతలకు, భూతపత్రులకు ఆరాధనము చేయుచుండెను. జీవుడు సంసారములో శరీరము, ఇంద్రియములు, బుద్ధివృత్తులతో అనేకములగు కర్మలు చేసి ఆయా దేవతలను వేరు వేరు కోరికలను కోరి ఆరాధించుచు కాలము గడుపుచుండును. బిడ్డల పైన, ధనము పైన, వారి సుఖమునకై, వారి క్షేమమునకై చేయు కర్మల పైన దృష్టి తప్ప ఆత్మ చింతనము గాని, పరమాత్మ చింతనము గాని ఉండదు. ఇట్లు కాలము గడిచిపోవును. ఇది ప్రేయసీ ప్రియులకు అత్యంతము ప్రియమైన యవ్వనము గడిచిపోవును. ఇది ప్రేయసీ ప్రియులకు చాలా అనిష్టమైనది. ఇది జీవ సంసార యాత్ర. ఇంకను కర్మలు చేయవలెనని కోరిక తగ్గదు. కుటుంబమునందు ఆసక్తి తగ్గదు.

కానీ వారి మనసుకు బాధగా ఉన్నను వారికి అప్రియమగు వార్ధక్యం వచ్చిపడును. దానిని కథలో చూపుచున్నారు. ఆ కథ ఏమిటంటే చండవేగుడను ఒక గంధర్వ రాజు ఉండెను. అతనికి పరివారముగా పురుషులు 360 మంది, స్త్రీలు 360 మంది ఉండురు. పురుషులు తెల్లగా ఉందురు, స్త్రీలు నల్లగా ఉందురు. వీరు కలిసియే ఉందురు. ఒక పురుషుడు ఒక స్త్రీ జంటగా ఉందురు. వీరు ఎవరి కంట పడరు. కనపడకుండా ఆ పురంజన పట్టణముపై పడి ఎంతో ప్రయత్నముతో నిర్మించుకున్న పట్టణమును క్రమముగా శిథిలము చేదురు. చండవేగుడే కాలము. కాలమునకు సంవత్సరము గుర్తు. సంవత్సరమునకు 360 రోజులు. ఆ రోజులే అతని పరివారము. అతని అనుచరులకు పురుషులు పగళ్ళు, స్త్రీలు రాత్రిళ్ళు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉందురు. ఇదియే ఒక దినము. ఇట్టి దినములు 360. ఇదియే గంధర్వ రాజు పరివారము. ఈ రాత్రులు అనగా గంధర్వ స్త్రీలు ఒకప్పుడు తెల్లగను ఒకప్పుడు నల్లగను ఉందురు అనగా శుక్ల పక్షము కృష్ణ పక్షము. ఈ పక్షములలో రాత్రిళ్ళు తెల్లగను నల్లగను ఉండును. ఈ గంధర్వ రాజు అనిటి కాలము తన బలముచే పురంజనుని పురమును అనగా జీవుని శరీరమును పూర్తిగా దోచుకొనును. పురంజనుడు ఆ 720 మంది స్త్రీ పురుష గంధర్వులతో నూరు ఏళ్ళు పోరాటం సాగించెను. అనగా ప్రాణమున్నంత కాలము పోరాడుచునే ఉండును. ఒక్కడు అందరితో యుద్ధము చేయలేక చివరకు దిగులు పొంది ఉండును. వార్ధక్యములో ఇంద్రియములు పని చేయవు. ప్రాణశక్తి సన్నగిల్లును. అట్టి స్థితిలో ఉన్న పురంజనుడు ఈ పాంచాల దేశములో తన సేవకులు ఏమి తెచ్చి పెట్టినా దానిని తినుచు ఆ స్త్రీకి వశుడై అట్లే బ్రతికి ఉండెను. వార్ధక్యం వచ్చినను ఇంద్రియములు సంపాదించి పెట్టు విషయాలు అనుభవించుచు భయపడకుండా జీవించి ఉండును. ఇట్లు పురంజనుడు పురంజనునితో వృద్ధుడై జీవితము గడుపుచుండగా ఒక విచిత్రమైన సన్నివేశం ఏర్పడెను.

ఒక కన్య. ఆమె పేరు కాలకన్య. ఆమెకు వివాహము కాలేదు. భర్తకై వెదుకుచు ఆమె మూడు లోకములు సంచరించుచుండెను. ఆమెకు హెచ్చ ఎటను భర్త దొరకలేదు. ఆమె సౌభాగ్యము లేనిదై దుర్భర అయి ఉండెను. ఆమె సౌందర్యమును అనుభవించు పురుషుడు దొరకకపోవుటచే దుర్భర అయి ఉండెను. జర అనేటువంటి ముసలితనం గురించి ఉన్న భావాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. O Lord, the ruler of the universe, the abode of the universe, the controller of the world, the power of the city, the virtues of the earth, the sustainer of the universe, the destroyer of the endless, the complete, the spreader of knowledge, the self-controlled, the destroyer of the darkness, salutations to you. O Srihari, You, by your will, accepting the qualities of Rajas and Tamas, the essence of the great Maya power, as your occupation, and gradually becoming the cause of the creation, preservation, and destruction of the world, you have manifested as the form of the universe. You, who are beyond space and time, are in the form of complete knowledge that grows in eternal time, and you are beyond darkness. Namaste. Aitken, Chapter 17, 17th Psalm. Dear relatives, welcome to the 33rd podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation with Vidura Maitreya, we have experienced Puranjana Charitra and the essence of Puranjana Charitra to some extent. And we'll learn about the front part. After a being joins the body, it is very rare to get a human body. Even though it is connected with the body, be careful. Seeing the sufferings of the dream, deep sleep states, the mind and wisdom By the grace of God, one gets it once. Wisdom will be given. But the infinite fragrances, filled with tastes, the natural connection will happen again. As soon as it happens, the intellect mixed with dust, again takes control and deludes him. Similarly, Puranjunudu came from hunting and, not finding his wife, went to a certain place and saw her and was with her. She, being captivated by her luxuries, will have a mind filled with sensual pleasures. Those are the actions, those are the lamentations of the hero.

He was subdued by it and again with her, again he was a follower of karma. Thus, Puranjani and Puranjunudu were enjoying. Once upon a time, Puranjani, after bathing and adorning her face, wore bright clothes and reached the king. He was so impressed with her. She took him in her arms. They secretly talked about many things. Without realizing that his intellect is deteriorating, his wisdom is fading, and time is passing, he is enjoying himself with her, day and night. With a womanly mind, men spend their lives like this. Lying on a valuable bed, keeping his beloved's shoulder as a pillow, to eradicate the ignorance caused by worldly pleasures, to be with her and experience pleasures. He called it Purushartha. He forgot himself. Then he was not aware of his identity. That is, he had forgotten the form of the soul and also the form of the Supreme Soul. While he was so engrossed, without knowing how time passed, his youth passed. For Puranjun, in Puranjun, eleven hundred people They have sons. Senses 11, the distortions that occur to the 11 senses, considering each one as 100 100, considering 1100 people, saying 1100 people are sons. After the senses are disturbed, the intellectual faculties are formed. They're like girls. It is because of these intellectuals that fame and infamy arise. After the evolution of the senses, the intellect and emotions are formed. If one considers that 10 intellects are formed for each sense organ, it is believed that a total of 110 intellects are formed for 11 senses, and they are described as 110 girls. While it continues like this. Puranjaneya has completed 10 years of age. The kingdom he ruled was called the Panchala kingdom. Because they express the experiences of the subject to the living being, they are called the five senses.

Those are the Panchalas. The Lord is the life of those who are called to the priesthood. Therefore, they call him Panchalapati. Sons are the result of sensory development. Daughters are the intellectual offspring of the Buddhi-vruthi. They made marriages after seeing suitable relationships for them. After experiencing things with the senses, one should contemplate good and bad about them with intellect and decide whether to do this or not. We will do the thinking. Those wives and husbands, thus deciding with their minds, begin to perform their duties. They are good deeds and also bad deeds. The same offspring. Thus, Puranjunu had a hundred and hundred children, sons and daughters, born to him. Thus, the senses, the objects, the experience of them, the intellectual activities formed by them, and the actions performed by them. Thus, for the being associated with this body, worldly life has increased. The lineage of Puranjana was greatly developed. Puranjunu's affection for his sons, who are partners in his income, increased in the house, in the wealth. He always thinks about them, but not about himself He lived without thinking about others. This is the worldly tendency of a being with this body. He was killing many animals, desiring many pleasures, and performing sacrifices. He was worshipping the gods, the ancestors, and the ghosts. A living being, in the world, performs various actions with the body, senses, and intellect, and spends time worshiping those deities, asking for different desires. There will be no self-contemplation or supreme contemplation, except for focusing on the actions done on children, on wealth, for their happiness, for their well-being. Thus passes the time. This is the most beloved youth for lovers. This is something very dear to the heart of the lovers. It's the journey of life. The desire to perform actions does not diminish. The interest of the family will not diminish.

But even if it is painful to their hearts, they will experience unpleasant old age. That's what the story is about. The story is about a Gandharva king named Chanda-vegu. He has 360 men and 360 women as his family. The men are fair, while the women are dark-skinned. They will be together. A man and a woman are a couple. They are invisible to everyone. Without being seen, that Puranjana city fell on the city, and with great effort, the city that was built is gradually being destroyed. The time of the lion has arrived. Year of the month. 360 days in a year. Those were, like, his relatives. His followers were men during the day and women at night. A man and a woman are together. It's a day that will be remembered. 360 days in a year. This is the Gandharva king's entourage. These nights, meaning the Gandharva women, were sometimes white and sometimes black, meaning the Shukla Paksha and Krishna Paksha. These birds are white and black at night. This Gandharva king, by his strength, conquered Puranjunu's city, that is, the living being Will completely take over the body. Puranjunudu fought for a hundred years with those 720 men and women Gandharvas. That is, as long as there is life, it will keep fighting. One person, unable to fight everyone, will eventually be discouraged. The senses do not work in old age. The life force is depleting. In that condition, Puranjunudu, in this Panchala country, whatever his servants brought and placed, he would eat it and remain subservient to that woman and live like that. Even if old age comes, one should acquire senses, experience the things, and live without fear. Thus, Puranjunudu, while spending his life growing old with Puranjunudu, a strange incident occurred.

A virgin. Her name is Kalakanya. She was not married. Searching for her husband, she wandered through three worlds. She couldn't find a husband anywhere. She was unlucky and suffered. She was distressed because a man who could experience her beauty was not found. We will learn about the feeling of old age in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.